హుకుంపేట వినాయకుని విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్ ను ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారట.మొట్టమొదటగా ఈ సంఘటనలో టీడీపీ నేత బాబుఖాన్ చౌదరి హస్తం ఉందని అనుమానించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
కానీ ఈ వివాదంలో బుచ్చయ్య చౌదరీ పీఏ సందీప్ హస్తం ఉందని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుండగా ఈ విషయం తెలుసుకున్న సందీప్ పారిపోయాడు.తాజాగా పరారీలో ఉన్న సందీప్ శ్రీశైలంలో తలదాచుకున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఈ రోజు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో హాజరుపరచగా సందీప్కు కోర్టు రిమాండ్ విధించింది.
కాగా ఈ అంశంలో మరికొందరిపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారట అధికారులు.