ఎమ్మెల్యే పీఏను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. ఎందుకంటే.. ?

హుకుంపేట వినాయకుని విగ్రహానికి మలినం పూసిన ఘటనపై సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చిటికెల సందీప్‌ ను ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారట.మొట్టమొదటగా ఈ సంఘటనలో టీడీపీ నేత బాబుఖాన్‌ చౌదరి హస్తం ఉందని అనుమానించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

 Mla Gorantla Butchaiah Chowdary Pa Sandeep Arrested Srisailam, Andrapradesh, Mla-TeluguStop.com

కానీ ఈ వివాదంలో బుచ్చయ్య చౌదరీ పీఏ సందీప్‌ హస్తం ఉందని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుండగా ఈ విషయం తెలుసుకున్న సందీప్ పారిపోయాడు.తాజాగా పరారీలో ఉన్న సందీప్‌ శ్రీశైలంలో తలదాచుకున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఈ రోజు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో హాజరుపరచగా సందీప్‌కు కోర్టు రిమాండ్‌ విధించింది.

కాగా ఈ అంశంలో మరికొందరిపై కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారట అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube