మునుగోడులో జరిగే బీజేపీ సభను అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.అందుకే బీజేపీ బహిరంగ సభ కంటే ముందు రోజే సభ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు.
మరోవైపు రాష్ట్రంలో చాలా మంది ప్రజా ప్రతినిధులు కాషాయకండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ క్రమంలోనే పార్టీ మారకుండా ఉండేందుకు సొంత పార్టీ నేతలకే టీఆర్ఎస్ వెల కడుతుందని ఆరోపించారు.
అదేవిధంగా, కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై ఇంజినీర్లతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.ఒకవేళ అవినీతి జరగకుండా ఉంటే ప్రాజెక్ట్ పరిశీనలకు వెళ్లకుండా ఇతర పార్టీల నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.