నందమూరి బాలకృష్ణ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, రాజకీయ నాయకుడిగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ రెండు సార్లు ఎమ్మెల్యేగా పదవి దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే గత రెండు రోజుల నుంచి ఈయన హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.ఇదిలా ఉండగా తన నియోజకవర్గ ప్రజల కోసం బాలకృష్ణ ఎన్టీఆర్ ఆరోగ్య రథం అనే వాహనాన్ని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.
ఇక రెండు రోజుల నుంచి హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కొట్నూరు ఉన్నత పాఠశాల ఆవరణంలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలకు కావలసిన ఎల్ఈడి టీవీలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ఉన్నఫలంగా టీచర్ అవతారం ఎత్తి అక్కడున్నటువంటి విద్యార్థులకు హితబోధ చేశారు.
ఇలా టీచర్ గా మారిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో అక్కడి విద్యార్థులకు క్లాస్ తీసుకుని వార్నింగ్ ఇచ్చారు.
ప్రస్తుత కాలంలో పిల్లలు బుక్కులపై శ్రద్ధ చూపకుండా ఫేస్ బుక్ పై శ్రద్ధ చూపెడుతున్నారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ ఎక్కువగా విద్యార్థులు సోషల్ మీడియాలో, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ అంటూ కాలం వృధా చేయకుండా, చదువుపై దృష్టి పెట్టి తల్లిదండ్రులకు దేశానికి గుర్తింపు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ మెలగాలి అంటూ ఈయన తనదైన స్టైల్ లో విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు.ఇలా బాలకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి ఇలాంటి మంచి వ్యాఖ్యలు చెప్పడంతో బాలయ్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.