తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా లోకేష్ ఉన్నా, ఆయన శక్తి సామర్థ్యాలపై పార్టీ శ్రేణుల్లో నమ్మకం లేకపోవడంతో ప్రత్యామ్నాయ నేత కోసం టిడిపి నాయకుల్లో చాలా మంది ఎదురు చూపులు చూస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని చాలా మంది చాలా ఆశలే పెట్టుకున్నారు.కానీ జూనియర్ మాత్రం రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నట్లు వ్యహరిస్తున్నారు.
ఇదిలా ఉండగానే టిడిపి పై వైసిపి ఎదురుదాడి తీవ్ర తరం అయింది.ముఖ్యంగా కొడాలి నాని వంటి నాయకులు ఎక్కువగా టిడిపి ,చంద్రబాబు, లోకేష్ వంటి వారిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నా, ఆ విమర్శలను తిప్పి కొట్టే అంతటి స్థాయి నాయకులు టిడిపిలో సరిగా లేకపోవడం, ఎక్కువ మంది యాక్టివ్ గా లేకపోవడం వంటి వ్యవహారాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటునే వస్తున్నారు
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం , హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా మంత్రి కొడాలి నాని వంటి వారిపై విమర్శలు చేస్తూ , విరుచుకు పడటం వంటి వ్యవహారాలతో టిడిపిలో ఒక్కసారిగా ఊపు వచ్చింది.బాలయ్య వ్యాఖ్యలతో కొడాలి నాని సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇక మాటలు కాదు చేతలతో చూపిస్తాను అంటూ ఘాటు విమర్శలు బాలయ్య చేయడంతో, ఇప్పుడు చంద్రబాబు లోకేష్ లకు ప్రత్యామ్నాయం బాలయ్య అనే అభిప్రాయం మెజార్టీ టిడిపి నాయకులు వచ్చింది.
ఇక త్వరలోనే ఆయన హిందూపురం మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో చేసేందుకు కసరత్తు చేస్తుండటంతో బాలయ్య లో కొత్త ఆలోచన ఈ విధంగా రేకెత్త డానికి కారణం ఎంటా అనే అనుమానాలు టిడిపి అగ్రనాయకత్వం లోనూ కలుగుతోంది.
కేవలం తాను ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిని కాదని, చంద్రబాబు తర్వాత ఆ స్థాయి ఉన్న వ్యక్తిని అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ఇప్పటికే టిడిపి పోలిట్ బ్యూరోలో స్థానం సంపాదించిన బాలయ్య రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేసి టీడీపీకి భవిష్యత్తులో తానే ప్రత్యామ్నాయం అన్ని నిరూ పించుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.