సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పంచ గ్రామాల భూ సమస్యలపై ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్

విశాఖ: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పంచ గ్రామాల భూ సమస్యలపై వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు.నాలుగు దశలుగా పంచ గ్రామాల్లో భూ సమస్యను పరిష్కరిస్తానని వెల్లడి.

 Mla Annamreddy Addep Raju Over Simhachalam Lakshmi Narasimha Swamy Land Issues,-TeluguStop.com

ఈరోజు ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అదీప్ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఐదు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చూసి గత ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్దేశంతోనే పంచ గ్రామాల సమస్య పై ఈ నెల 25న సమావేశమయ్యారని తెలిపారు.

వంద గజాల లోపున వారికి ఉచితంగా, వంద గజాల నుంచి 300 గజాల లోపు ఉన్న వారికి 1998వ సంవత్సరం ప్రకారం 70 శాతం చెల్లించాలి, 300 గజాలు పైన ఉన్న వారికి 1998 సంవత్సరం ప్రకారం పూర్తిగా చెల్లించాలని తెలిపారు.

కమర్షియల్ యూనిట్ వారికి పూర్తిగా మార్కెట్ వేల్యూ కట్టాలని కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.త్వరలో ని ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే అదీప్ ఆన్నారు.

వచ్చే సంక్రాంతి కల్లా పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube