వైసీపీ ప్రభుత్వంపై నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకని ప్రశ్నించారు.
సమస్యలు పరిష్కరించాలని కోరడం తప్పా అని ఎమ్మెల్యే ఆనం నిలదీశారు.తనను వద్దనుకుని వేరే వాళ్లను పెట్టారన్నారు.
ఇంతకముందు ముగ్గురు పరిశీలకులు వచ్చారు… వెళ్లారన్న ఆనం ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చాడంటూ విమర్శించారు.మరో రెండు నెలల్లో మహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుడదామన్న ఆనం వెంకటగిరి టీడీపీకి చాలా బలమైన నియోజకవర్గమని సంచలన వ్యాఖ్యలు చేశారు.