లాక్ డౌన్ నిర్ణయంపై వ్యక్తమవుతున్న మిశ్రమ స్పందన...ఇది సరైన సమయమేనా?

తెలంగాణలో దేశంలో ఎలాగైతే కరోనా విజ్రుంభిస్తుందో తెలంగాణలో కూడా యథాతథ స్థితి నెలకొంది.అయితే తెలంగాణలో మొదట్లో జిల్లాల వరకే నమోదైన కేసులు ఇప్పుడు గ్రామ స్థాయి వరకు విస్తరించాయి.

 Mixed Reaction To The Lockdown Decision Is This The Right Time, Cm Kcr, Corona S-TeluguStop.com

ఒక వైపు కరోనా కేసులు విజ్రుంభిస్తుండటంతో, పెద్ద ఎత్తున కరోనా మరణిస్తుండటం, మనం రోజూ చూసే మనుషులే కరోనా బారిన పడి మరణిస్తుండటంతో ప్రజల్లో ఒక విధమైన భయం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు.దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించకముందే చాలా వరకు గ్రామాలు, పట్టణాలు సెల్ఫ్ లాక్ డౌన్ ను విధించుకున్నాయి.

కాని కొంత మేర ప్రజల్లో విచక్షణ జ్ఞానం పెరగడంతో కరోనా నివారణ చర్యలు తెలుసుకుంటూ హోం ఐసోలేషన్ లోనే ఆరోగ్యం కుదుట పడ్డవారు కూడా ఉన్నారు.

కాని కొంత మంది కరోనా వచ్చిందని మానసికంగా ఆందోళన చెందడంతోనే పల్స్ రేట్ తగ్గి ఇక చివరి క్షణంలో ఆసుపత్రికి వస్తున్నారని, ఇక ఆ సమయంలో చేయాల్సింది చేసినా బాధితులు మరణిస్తుండటం జరుగుతున్నదని డాక్టర్ లు వివరిస్తున్నారు.

అయితే తాజాగా తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.అయితే చాలా మంది ఈ లాక్ డౌన్ నిర్ణయంపై సంతృప్తి వ్యక్తమవుతోంది.ఇప్పటికే ప్రజలు మానసికంగా లాక్ డౌన్ కు సిద్దమై ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా కరోనా కట్టడికి సహకరిస్తుండటంతో కరోనా కొద్ది మేర తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube