తెలంగాణలో దేశంలో ఎలాగైతే కరోనా విజ్రుంభిస్తుందో తెలంగాణలో కూడా యథాతథ స్థితి నెలకొంది.అయితే తెలంగాణలో మొదట్లో జిల్లాల వరకే నమోదైన కేసులు ఇప్పుడు గ్రామ స్థాయి వరకు విస్తరించాయి.
ఒక వైపు కరోనా కేసులు విజ్రుంభిస్తుండటంతో, పెద్ద ఎత్తున కరోనా మరణిస్తుండటం, మనం రోజూ చూసే మనుషులే కరోనా బారిన పడి మరణిస్తుండటంతో ప్రజల్లో ఒక విధమైన భయం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు.దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించకముందే చాలా వరకు గ్రామాలు, పట్టణాలు సెల్ఫ్ లాక్ డౌన్ ను విధించుకున్నాయి.
కాని కొంత మేర ప్రజల్లో విచక్షణ జ్ఞానం పెరగడంతో కరోనా నివారణ చర్యలు తెలుసుకుంటూ హోం ఐసోలేషన్ లోనే ఆరోగ్యం కుదుట పడ్డవారు కూడా ఉన్నారు.
కాని కొంత మంది కరోనా వచ్చిందని మానసికంగా ఆందోళన చెందడంతోనే పల్స్ రేట్ తగ్గి ఇక చివరి క్షణంలో ఆసుపత్రికి వస్తున్నారని, ఇక ఆ సమయంలో చేయాల్సింది చేసినా బాధితులు మరణిస్తుండటం జరుగుతున్నదని డాక్టర్ లు వివరిస్తున్నారు.
అయితే తాజాగా తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.అయితే చాలా మంది ఈ లాక్ డౌన్ నిర్ణయంపై సంతృప్తి వ్యక్తమవుతోంది.ఇప్పటికే ప్రజలు మానసికంగా లాక్ డౌన్ కు సిద్దమై ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా కరోనా కట్టడికి సహకరిస్తుండటంతో కరోనా కొద్ది మేర తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.