తాజాగా ఆండ్రాయిడ్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ వినియోగదారుల కోసం దేశం లోకి కొత్తగా MIUI 12 వచ్చేసింది.అయితే ప్రస్తుతం ఈ అప్ డేట్ కేవలం షియోమి సంస్థ తయారు చేసిన ఫోన్లలో అందుబాటులోకి రాబోతోంది.
ముందుగా మొదటి దశలో ఈ అప్ డేట్ షియోమీ సంస్థ నుండి వచ్చిన రెడ్ మీ నోట్ 7 ప్రో, రెడ్ మీ నోట్ 7, రెడ్ మీ నోట్ 8, రెడ్ మీ నోట్ 8 ప్రో, రెడ్ మీ నోట్ 9, రెడ్ మీ నోట్ 9 ప్రో, ఎమ్ఐ 10 లో విడుదల చేయనున్నారు.
కొద్దిరోజుల తర్వాత మిగతా ఫోన్లో కూడా ఈ అప్ డేట్ లభించనుంది.
ఇక ఈ అప్ డేట్ లోని ఫీచర్ల విషయానికొస్తే.యూజర్ ఇంటర్ ఫేస్ మరింత ఆకర్షణీయంగా ఉండబోతోంది.
ఇందులో ప్రధానంగా సిస్టం వైడ్ డార్క్ మోడ్ ద్వారా మీ చుట్టూ ఉండే లైటింగ్ ఆధారంగా దానంతట అదే లైటింగ్ ఎఫెక్ట్స్ ను సరి చేసుకోగలదు.
వీటితో పాటు సరికొత్త సింబల్స్, ఏవైనా ముఖ్యమైన ఈవెంట్లను ప్రత్యేకంగా చూపించే క్యాలెండర్, కొత్తరకం వాల్ పేపర్స్, కెమెరా యూజర్ ఇంటర్ ఫేస్ పరంగా అనేక కీలక మార్పులను ఈ MIUI 12 లో అప్ డేట్ ద్వారా తీసుకువచ్చారు.
అంతేకాకుండా అల్ట్రా బ్యాటరీ సేవర్ సదుపాయం కూడా తీసుకురావడంతో బ్యాటరీని మరింతగా ఆదా చేసుకుని సదుపాయాన్ని కల్పించబోతున్నారు.దీని ద్వారా కేవలం 5 శాతం బ్యాటరీ ఉన్న సమయంలో కూడా ఏకంగా ఐదు గంటల పాటు ఫోన్ ఉపయోగించవచ్చు.