బాలీవుడ్ లో ఒకనాటి క్లాసిక్ హిట్ మూవీ మిస్టర్ ఇండియా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.అనిల్ కపూర్, అందాల నటి శ్రీదేవి జంటగా నటించిన ఆ సినిమా హిందీలో సంచలనాలు క్రియేట్ చేసింది.
ఇక అందులో అమ్రిష్ పూరి చేసిన విలనిజం ఇప్పటికి గుర్తుండిపోతుంది.అతీత శక్తులు ఉన్న ఒక వాచ్ చుట్టూ కథ తిరుగుతుంది.
అయితే ఇప్పుడు అంత అద్బుతమైన క్లాసిక్ మూవీని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఓ ప్రముఖ దర్శకుడు ఉన్నాడు.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
అయితే ఇక్కడే అసలు గొడవ మొదలైంది.
ఆ సినిమాలో హీరోగా చేసిన అనిల్ కపూర్ కూతురు హీరోయిన్ సోనమ్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ రీమేక్ వార్తలపై అసహనం వ్యక్తం చేసింది.ఈ సినిమా గురించి నాన్నతో కాని, ఆ సినిమా దర్శకుడు శేఖర్ కపూర్ తో కాని అలీ అబ్బాస్ సంప్రదించే ప్రయత్నం చేయలేదని తెలిపింది.
ఈ విషయంలో వారు మా నాన్న పట్ల అమర్యాదగా ప్రవర్తించడమే అవుతుంది అని చెప్పింది.రీమేక్ ప్లాన్ చేస్తున్న ఎవరు కూడా అప్పటి టీంతో సంప్రదించ కుండా ఎలా సినిమా చేస్తారు అంటూ ఘాటుగా స్పందించింది.
మరి వీరి వివాదం ఎంత వరకు వెళ్తుంది.దీనికి అలీ అబ్బాస్ ఎలా క్లారిటీ ఇస్తాడు అనేది చూడాలి.
.