ధోనీ అంటే పరిచయం అక్కర్లేని పేరు.ఆయనకు క్రికెట్ చరిత్రలో సెపరేటు క్రేజ్ ఉంది.
ఇప్పటికీ ఆయన పేరు వింటేనే కోట్లాదిమంది క్రికెట్ ప్రేమికులు పులకరించిపోతుంటారు.ధోనీ రిటైర్డ్ అయినప్పటికీ ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్నాడు.
అయితే ఇప్పుడు ఐపీఎల్కు కాస్త విరామం దొరకడంతో ఈ సమయాన్ని ధోనీ తన ముద్దుల కూతురు జీవా తో కలిసి రాంచీ శివార్లలో ఉన్న తన ఫామ్హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాడు.అక్కడ ఉన్న పెంపుడు జంతువులతో సరదాగా గడుపుతూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు ధోరీ ఫ్యామిలీ.
ధోనీ తన కూతును ఎంతగా ఇష్టపడతారో అందరికీ తెలిసిందే.ఇదే క్రమంలో జంతువులను కూడా ధోనీ చాలా ఇష్టపడుతారనే విషయం అందరికీ తెలిసిందే.ఇక ధోనికి ఉన్న ఫామ్హౌస్లో చాలా వరకు కుక్కలు పెరుగుతున్నాయి.సమయం దొరికినప్పుడల్లా ధోనీ, ఆయన కూతురు జీవా కలిసి ఆ పెంపుడు జంతువులతో కలిసి ఆడుకుంటారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
అయితే ఇటీవల ధోనీ సాధు జంతువుల్లోకి కొత్తగా ఓ నల్ల గుర్రం కూడా వచ్చిందని తెలుస్తోంది.
ఇక దీనికి ‘చేతక్’ అని పేరు పెట్టాడు మన ధోనీ.ఇక ఆ చేతక్తో ధోనీ గడుపుతున్న వీడియోలు చాలానే చెక్కర్లుకొట్టాయి.
అయితే చేతక్కు తోడుగా ఇప్పుడు మరో గుర్రం కూడా తీసుకున్నాడు ధోనీ.ఈ గుర్రానికి ‘పోనీ’ అని పేరు పెట్టి.
దాన్ని తన కూతురు జీవాకు మరిచిపోలేని బహుమతిగా అందించాడు ధోనీ.
ఇక అతే సంగతులు.ధోనీ ఇచ్చిన గిఫ్ట్ను జీవా తన ఇన్స్టాగ్రమ్లో షేర్ చేసి అందరికీ పరిచయం చేసింది.అయితే జీవా ఇన్స్టాను ధోనీ, సాక్షినే చూసుకుంటున్నారు.
ఈ పోస్టుపై అభిమానులు చాలా రకాలుగా స్పందించారు.ఇక ఓ నెటిజన్ అయితే ఏకంగా ‘కొత్త ప్రేమకథ’ అంటూ వైరల్ కామెంట్ చేశారు.
ఇక ఇప్పుడు ఐపీఎల్ను యూఏఈలో నిర్వహించనున్న విషయం తెలిసిందే.ఇదుకోసం ధోనీ ప్రిపేర్ అవుతున్నాడు.