రైతుగా మారిపోయిన ధోని... సోషల్ మీడియాలో వైరల్

క్రికెట్ ప్రపంచంలో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఇక కెప్తెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని వాటిని విరాట్ కోహ్లికి అప్పగించిన తర్వాత అతను మెల్లగా క్రికెట్ కి దూరం అవుతూ వస్తున్నాడు.

 Mister Cool Dhoni New Avatar Like A Farmer-TeluguStop.com

ఆటగాడిగా గ్రౌండ్ లోకి దిగాక తన పూర్తి ప్రతిభ చూపిస్తున్న అందరికిలగే అతని కెరియర్ కూడా చివరి దశకి చేరుకోవడంతో రిటైర్మెంట్ గురించి చర్చ నడుస్తుంది.గత ఆరు నెలలుగా ధోని క్రికెట్ కి దూరంగా ఉన్నాడు.

ఈ సమయాన్ని తనకి ఇష్టమైన పనుల కోసం మిస్టర్ కూల్ ఉపయోగించుకుంటున్నాడు.

ఎప్పుడు లాంగ్ రైడ్ లకి వెళ్తూ ట్రావెలర్ ఖాళీ సమయాలలో కనిపించే ధోని ఇప్పుడు కొత్త అవతారమెత్తాడు.

పొలం బాట పట్టి రైతుగా మారిపోయాడు.రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో పుచ్చ కాయలు, బొప్పాయి పండిస్తున్నాడు.

దానికి సంబంధించిన వీడియోను ధోనీ సోషల్ మీడియా లో షేర్ చేశాడు.సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నానంటూ అందులో చెప్పాడు.

ఆ వీడియోలో ధోనీ కొబ్బరికాయను కొట్టి పుచ్చకాయ విత్తనాలు నాటి సాగు ప్రారంభించాడు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.మెజారిటీ ప్రజలు మాత్రం ధోని చేసే పనులకి ఎప్పుడు మద్దతు ఇస్తూ ఉంటారు.

అతను ఎం చేసిన అందులో ఒక ప్రత్యేకత కచ్చితంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube