ప్రమాదాలు చెప్పిరావని చాలా సందర్భాల్లో నిరూపించబడుతున్నాయి.ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలైతే ఊహించని విధంగా చోటుచేసుకుంటున్నాయి ఇకపోతే ఆ మధ్యకాలంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
కాగా కొంతకాలం నుండి రైలు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు రాకపోయే సరికి ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్న నేపధ్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద ధానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది అనే న్యూస్ ఒక్క సారిగా ఉలిక్కిపడేలా చేసింది.
ఇక ధానాపూర్ ఎక్స్ప్రెస్ ఇంజన్ నుండి బోగీలు విడిపోయాయట.
కాగా ఇలా సుమారుగా 200 మీటర్ల దూరం ఇంజిన్ వెళ్లిపోగా స్టేషన్ ఘన్ పూర్ రైల్వే గేటు వద్ద బోగీలు ఆగిపోయాయని సమాచారం.ఇక ఈ ఘటన పై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు బోగీలను తీసుకొచ్చి ఇంజిన్ కు కలిపారట.
కానీ ఇంతసేపటి వరకు ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు.ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడిపారట.కాగా అధికారులు అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పిందని.ఊపిరిపీల్చుకున్నారట ప్రయాణికులు.
.