సినిమా ఇండస్ట్రీలో ఇంచు మించు ఒకే పేరుతో ఉన్న నటులు ఉంటారు.అయితే ఎవరైనా సంఘటనలు, లేదంటే ప్రమాదాలు జరిగినపుడు అలాంటి పేర్లు విషయంలో మీడియా కొంత కన్ఫ్యూజ్ అవుతుంది.
ఒకరికి బదులుగా మరొకరి ఫోటోని పబ్లిష్ చేసి న్యూస్ ప్రచారం చేస్తూ ఉంటుంది.అయితే విషయం తెలుసుకొని ఆ ఫోటో తొలగించేలోగా జరగాల్సిన డామేజ్ జరిగిపోతుంది.
తరుచుగా ఇలాంటి అనుభవాలు సెలబ్రెటీలకి ఎదురవుతూ ఉంటాయి.ఇప్పుడు అలాంటి అనుభవం టాలీవుడ్ హీరోయిన్ మిస్తీ చక్రవర్తికి ఎదురైంది.
బాలీవుడ్ లో ఐటెం గీతాలతో ఫేమస్ అయినా మిష్టీ ముఖర్జీ కిడ్నీ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది.బాలీవుడ్ చిత్ర పరిశ్రమకి ఆమె పరిచయం ఉంది కాబట్టి చాలా మంది ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.
అయితే మిస్తీ చక్రవర్తి కూడా బాలీవుడ్ సినిమాల ద్వారానే సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది.దీంతో మీడియా అత్యుత్సాహంతో కొద్ది మిష్టీ ముఖర్జీ వార్త ప్రచారం చేసే క్రమంలో మిస్తీ చక్రవర్తి ఫోటోని ఉపయోగించారు.
ఇక ఆ న్యూస్ క్షణాలలో వైరల్ కావడంతో అది హీరోయిన్ మిస్తీ చక్రవర్తి వరకు వెళ్ళింది.దీంతో ఆమె బయటకి వచ్చి నేను చనిపోలేదని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
భగవంతుడు దయ వల్ల నేను బ్రతికే ఉన్నాను.జీవితంలో ప్రయాణించాల్సింది ఇంకా చాలా ఉంది అని పోస్ట్ చేసి ఇలాంటి వార్తలు ప్రచారం చేసే క్రమంలో అత్యుత్సాహం చూపించకుండా కాస్తా ఆలోచించి వ్యవహరించాలని మీడియాకి క్లాస్ పీకింది.
మీడియా చూపించిన అత్యుత్సాహం కారణంగా తనకి విపరీతంగా ఫోన్ లు వస్తున్నాయని పేర్కొంది.మిస్తీ చక్రవర్తి నితిన్ కి జోడీగా చిన్నదాన నీకోసం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ సినిమా ఫ్లాప్ కావడం తరువాత ఈ భామ తెలుగులో కొన్ని సినిమాలు చేసిన అవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయో, ఎప్పుడు పోయాయో కూడా తెలియకపోవడం ఈమె గురించి సౌత్ లో పెద్దగా ఎవరికీ తెలియకుండా పోయింది.