మనం ఎన్నో రకాల మర్డర్ ల గురించి వినే ఉంటాం.ఏవో కొన్ని వివాదాల కారణంతో గుర్తుతెలియని వ్యక్తులు ఒకరినొకరు ఎన్నో రకాలుగా చంపుకోవడం సాదారణంగా జరిగే విషయమే.
కానీ గుంటూరులో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.ఒక వ్యక్తి మొహంపై స్ప్రే చల్లి దారుణంగా అతన్ని చంపిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది అయితే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.
గుంటూరు జిల్లా.పెదకూరపాడు మండలం,తాళ్లూరులో నివాసముంటున్న భాష్యం బ్రహ్మయ్య, హోటల్ ని నడుపుతూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు.అయితే హోటల్ లో మిగిలిన వ్యర్థ పదార్థాలను పడేసేందుకు బ్రహ్మయ్య ఊరి చివరకు తీసుకొని వెళ్ళాడు.అయితే అక్కడకు గుర్తుతెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి బ్రహ్మయ్య పై స్ప్రే చల్లి దాడి చేశారు.
బ్రహ్మయ్య ముఖంపై స్ప్రే చల్లడం తో తీవ్ర గాయాల పాలై మొహం అంతా మంటతో రావడంతో, అతికష్టంగా ఇంటిని చేరుకున్నాడు.అయితే కొద్ది సేపటికి ముఖంపై కాలిన గాయాలు అయినట్లుగా కనిపించడంతో బ్రహ్మయ్య ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బ్రహ్మయ్య ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బ్రహ్మయ్య పై యాసిడ్ తో దాడి చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ముఖంపై స్ప్రే చల్లి బ్రహ్మయ్య ను చంపడంతో ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది.బ్రహ్మయ్య ను చంపడానికి ఏవైనా తగాదాలు కారణం అయ్యుండొచ్చని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కేసు గురించి పూర్తి వివరాలను దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు తెలియజేశారు.స్ప్రే చల్లడం వల్ల మనిషి ప్రాణానికి ప్రమాదం ఉండదని, ఇందులో యాసిడ్ కలిపి ఉండవచ్చని, పోలీసులు భావిస్తున్నారు.