ప్రాణాలను కాపాడుకోవడం మానేసి.. నేరాలకు పాల్పడుతున్నారు.. మహారాష్ట్రలో దారుణం..?

మహారాష్ట్రలో కరోనా వైరస్ పీక్ స్టేజ్ లో ఉన్న విషయం తెలిసిందే.మహారాష్ట్రలో పరిస్థితులు చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం భయంతో జాగ్రత్తలు పాటిస్తున్నారు.

 Miscreant, Kidnap, Pregnant Cows,  Mumbai,cctv Footage,vinod Pandey,corona Virus-TeluguStop.com

కానీ అక్కడి జనాలు మాత్రం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.కరోనా పంజాకి చిక్కకుండా కాస్త ప్రాణాలు కాపాడుకోండి రా బాబు అంటే.

అబ్బే అదంతా మాకెందుకు అంటూ నేరాలకు పాల్పడుతున్నారు.తాజాగా ముంబైలో ఏకంగా ఒక గర్భిణీ అవును కిడ్నాప్ చేశారు కొంతమంది దొంగలు ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

వివరాల్లోకి వెళితే.వినోద్ పాండే అనే వ్యక్తి తండ్రితో కలిసి సీయోన్ కి దగ్గరగా ఉండే ఈ ప్రదేశంలో నివసిస్తున్నాడు.మాతుంగ గుడి వద్ద ఆవులను కట్టేసి జీవనం సాగిస్తున్నారు.ఇక జూన్ 5 తేదీ తర్వాత తన రెండు ఆవులు కనిపించకపోవడంతో… చుట్టూపక్కల పరిసరాలు వెదికాడు.

ఇక ఎక్కడ ఆవుల జాడ కనిపించకపోవడంతో చేసేదేమిలేక పోలీసులకు ఆశ్రయించాడు.తన జెర్సీ ఆవు కనిపించడం లేదని… ఆవు విలువ 80 వేల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను గమనించారు.

దీంతో ఇద్దరు వ్యక్తులు ఆవుని కట్టేసిన ప్రాంతంలో బైక్ పై వచ్చి రెక్కీ నిర్వహించి ఆ తర్వాత రాత్రి రెండున్నర గంటల సమయంలో వచ్చి ఆవుకు ఏదో ఇంజక్షన్ ఇచ్చి… ఇన్నోవా కారు లోకి ఎక్కించి ఆవును దొంగలించారు అని పోలీసులు గుర్తించారు.

అయితే సదరు వాహనాల నెంబర్ ప్లేట్ మాత్రం సిసిటివి ఫుటేజీలో స్పష్టంగా కనిపించలేదు.ఇక వినోద్ పాండే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube