హన్మకొండ జిల్లా కమలాపూర్ లో కొందరు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు.ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు.
కాగా ఈనెల 31న మంత్రి కేటీఆర్ ఈ హాల్ ను ప్రారంభించాల్సి ఉంది.శిలాఫలకం గద్దెను కూల్చివేయడంతో గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఘటనా స్థలంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.