ఇటీవల విడుదలైన జార్జ్ రెడ్డి సినిమా ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ పేరు ప్రముఖంగా వినిపించింది.ఆ సినిమాలోని ఒక పాటను పవన్ కళ్యాణ్కు అంకితం ఇవ్వడంతో పాటు నాగబాబు మాట్లాడుతూ జార్జ్రెడ్డిలాగే పవన్ కళ్యాణ్ అనిపిస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు.
అలా జార్జ్రెడ్డికి మంచి పబ్లిసిటీ దక్కింది.అలా అలా సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి.
ఇప్పుడు మరో సినిమా మిస్ మ్యాచ్ పవన్ పేరును జపిస్తుంది.పవన్ పేరుతో ప్రమోషన్ చేసి క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
మిస్ మ్యాచ్ చిత్రంలో తొలిప్రేమ చిత్రంలోని ఈమనసే అనే పాటను రీమేడ్ చేస్తున్నారు.ఆ పాటకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు.ఆ ప్రోమో ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తుంది.అయితే సినిమాకు మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ దక్కడం లేదు.
మిస్ మ్యాచ్లోని తొలిప్రేమ పాటను ఈనెల 30న విడుదల చేయబోతున్నారు.పాట విడుదల తర్వాత మిస్ మ్యాచ్కు మంచి పబ్లిసిటీ వస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సినిమాలో ఉదయ్ శంకర్ మరియు ఐశ్వర్య రాజేష్లు జంటగా నటించారు.