తెలుగులో ఒకప్పుడు మోహిని, అనుమానాస్పదం, 786, ఒక్కటవుదాం, గీత, తదితర చిత్రాల్లో హీరోయిన్ గా నటించి బాగానే ఆకట్టుకున్న తెలుగు ప్రముఖ హీరోయిన్ “హంసా నందిని” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు హీరోయిన్ గా కంటే ఈ మధ్య పలు చిత్రాలలో, స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ బాగా పాపులర్ అయ్యింది.
ఆ మధ్య తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన “మిర్చి” చిత్రంలో “మిర్చి మిర్చి” అంటూ కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసేంది.దీంతో ఈ అమ్మడు హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలే ఎక్కువగా తలుపు తట్టాయి.
దాంతో హంసా నందిని కూడా తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని వచ్చిన ప్రతి ఆఫర్ ని కాదనకుండా నటించింది.కాగా నటి హంసా నందిని ఒక్కో పాటకి దాదాపుగా “50 లక్షల రూపాయలకు” పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
అయితే ఈ మధ్య నటి హంసా నందిని సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.కాగా తాజాగా హంసా నందిని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటో కారణంగా మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఆ ఫోటోలో హంసా నందిని కళ్లద్దాలు ధరించి ఒంటికి టవల్ చుట్టుకుని కాఫీ తాగుతూ కనిపించింది.అంతేగాక ఈ ఫోటోకి “అలెక్సా వాష్ మై హెయిర్” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.
దీంతో కొందరు నెటిజన్లు హంసా నందిని టెక్నాలజీని బాగానే ఉపయోగిస్తోందంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.కాగా ప్రస్తుతం హంసా నందిని ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని దాదాపుగా ఆరు లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే హంసా నందిని కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంది.కాగా నటి హంసా నందిని సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో హీరోయిన్ గా నటించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పలు డిజాస్టర్ ను ఎదుర్కోవడంతో ఈ ప్రభావం తన సినీ కెరీర్ పై పడింది.దీంతో హీరోయిన్ గా అవకాశాలు కోల్పోయినప్పటికీ ఈ మధ్య వరుసగా స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది.