అభం శుభం తెలియని రెండేళ్ల ఏళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలురు ఆఘాత్యాయినికి ఒడిగట్టారు.ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని విశేశ్వర్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మంజ్రియా గ్రామంలో చోటు చేసుకుంది.
మంజ్రియా గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఇద్దరు మైనర్ బాలురు ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు.చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేశారు.
ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని స్థానికంగా దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంకులో పడేశారు.
చిన్నారి కనిపించక పోవడంతో ఆమె తల్లిదండ్రులు చుట్టు పరిసరాల్లో అంతా వెతికారు.
కొన్ని గంటల తర్వాత వాటర్ ట్యాంకులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులైన ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు.అనంతరం వారిని జువైనల్ జస్టిస్ కోర్టు ముందు హాజరుపరిచారు.
ఇద్దరు మైనర్లకు ఒకరికి 12 ఏళ్లు, మరొకరికి 13 ఏళ్లు ఉన్నాయి.