ఇటీవల ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా పబ్ జీ గేమ్ లో మునిగిపోతున్నారు.ఈ పబ్ జీ గేమ్ ను బ్యాన్ చేయాలనీ పలు రాష్ట్రాలు డిమాండ్ కూడా చేస్తున్నాయి.
ఈ పబ్ జీ గేమ్ ల కారణంగా ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కూడా.ఇన్ని అనర్ధాలు జరుగుతున్నప్పటికీ చిన్నారులలో మార్పు రావడం లేదు.
ఈ పబ్ జీ గేమ్ లో మునిగితేలిపోతున్నారు.అయితే ఈ పబ్ జీ గేమ్ ఆడవద్దు అని అడ్డుకున్న కారణంగా ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే….
బీవండి కి చెందిన ఒక బాలుడు(15) స్మార్ట్ ఫోన్ లో పబ్ జీ గేమ్ ఆడుతున్నాడు.అయితే ఇంతలో ఆ బాలుడి అన్న మహమ్మద్ షేక్(19) వచ్చి తన ఫోన్ లో పబ్ జీ గేమ్ ఆడుతున్న తమ్ముడిని ఆ గేమ్ ఆడొద్దు అంటూ వారించాడు.
దీనితో ఒక్కసారిగా కోపం తో ఊగిపోయిన ఆ బాలుడు అన్న తలను గోడకు కొట్టి, అక్కడే ఉన్న కత్తెర తో దారుణంగా పొడిచాడు.అంతే వెంటనే ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
కేవలం గేమ్ ఆడొద్దు అన్న కారణంగా సొంత అన్ననే పొట్టనపెట్టుకున్నాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది.