సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు వింటే ఆశ్చర్యానికి గురికాకతప్పదు.తాజాగా జార్ఖండ్ లో చోటు చేసుకున్న సంఘటన కూడా ఇలాంటిదే.
ఇద్దరు మైనర్ బాలికలు పెళ్లి చేసుకున్న ఘటన జార్ఖండ్ లో జరిగింది.వారిద్దరూ బాలికలు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు.
ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది.ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేనంతగా మారిపోయింది.
ఈ విషయాన్నీ ఇద్దరు బాలికలు కుటుంబ సభ్యులకు చెప్పగా వారి కుటుంబాలు ఒప్పుకోలేదు.వారికి నచ్చచెప్పారు.ఇలా చేయడం తప్పు అని సర్ది చెప్పారు.అయినా వారి మనసులనుండి ఆ విషయం పోలేదు.
ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
ధన్బాద్లోని సుగియాదిలో నివసిస్తున్న ఇద్దరు బాలికలు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు.
అందులో ఒక బాలిక వయసు 13 సంవత్సరాలు కాగా.మరో బాలిక వయసు 14 సంవత్సరాలు.
వీరిద్దరి పేర్లు కూడా ఒకటే.వీరి స్నేహం రోజురోజుకు బలపడుతూ ప్రేమగా మారిపోయింది.
పెళ్ళి చేసుకుని కలిసి బతకాలని అనుకున్నారు.అయితే అందుకు తల్లిదండ్రులు అడ్డు చెప్పారు.
అయితే ఆ విషయాన్ని స్నేహితులకు కూడా చెప్పారు.వారు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోలేదు.దాంతో వీరిద్దరూ ఒక ప్లాన్ వేశారు.పెద్ద వయసు కలిగిన బాలిక షర్ట్, ప్యాంటు వేసుకుని భర్తగా, చిన్న వయసు కలిగిన బాలిక భార్యగా మారాలని నిర్ణయించుకుని అక్కడికి సమీపంలోని ఒక ఆలయంలో పెళ్ళి చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు.తర్వాత ఆ బాలిక మేడలో మంగళసూత్రం, నుదిటిపై బొట్టు ఉండడాన్ని చుసిన ఆమె తల్లి ఏం జరిగింది అని నిలదీయడంతో అసలు విషయం తెలిసింది.
దీంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు.ఈ విషయంపై ఇరు కుటుంబాలు పోలీసులను సాయం చేయమని కోరాయి.
ఈ విషయంపై స్పందించిన పోలీసులు బాలికలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.అయితే బాలికలు చెప్పిన సమాధానం విని పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.బాలికలు.ఇప్పుడు మాకు పెళ్ళి వయసు లేదని ఇలా చేస్తున్నారు.
కానీ పెళ్ళి వయసుకు వచ్చిన తర్వాత మేము కలిసే జీవిస్తాం అని చెప్పారు.ఈ విషయం విన్న పోలీసులు, కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.