మహిళలు, ఆడ పిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.సంబంధాలు మరిచి కొందరు క్రూర మృగాలుగా, కామంతో మరికొందరు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నాయి.
ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది.తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది.
అనాథాశ్రమంలో ఉన్న ఓ బాలికపై కన్నేసిన నిర్వాహకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడి కామవాంఛను తీర్చుకున్నాడు.
సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ అనాథాశ్రమంలో ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది.14 ఏళ్ల బాలికపై కన్నేసిక ఆశ్రమ నిర్వాహకుడు ఆశ్రమంలో అందరు పడుకునే సమయంలో బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసేవాడు.నిర్వాహకుడు ఇలా చేస్తున్నాడని తెలిసి ఆశ్రమ వార్డెన్ కూడా ఆ పాపంలో పాలు పంచుకున్నాడు.
ఇద్దరు కలిసి ఆ మైనర్ బాలికపై అనేక సార్లు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసేవారు.బాలికకు అత్యాచారం జరుగుతుందన్న విషయం తెలియడంతో ఈ విషయం బయట చెబితే చంపేస్తామని బెదిరించారు.
బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిర్వాహకుడు ఆస్పత్రికి తీసుకెళ్లాడు.దీంతో అసలు విషయం బయటపడింది.
ఈ విషయం బాధితురాలి బంధువులకు తెలియడంతో వాళ్లు ఆశ్రమ నిర్వాహకుడిపై, వార్డెన్ పై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వారిద్దరిని అరెస్ట్ చేశారు.
కేసు దర్యాప్తులో ఉంది.