మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన ఘటన మదనపల్లెలో చోటు చేసుకుంది.రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
మదనపల్లె రూరల్ మండలంలోని ఓ గ్రామంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ కమలాపురానికి చెందిన కళ్యాన్ అనే యువకుడు వెంట పడ్డాడు.తాను లేకపోతే ఉండలేనంటూ ఆ అమ్మాయిని నమ్మించాడు.
ఇది నమ్మిన ఆ బాలిక కూడా అతడిని ప్రేమించింది.అయితే ఇదే అదను కోసం చూసిన ఆ యువకుడు ఆమెను శారీరకంగా లోబర్చుకున్నాడు.ఆ తరువాత అతడు మొహం చాటేశాడు.మూడు నెలల గర్భం దాల్చిన యువతి తాను మోసపోయానంటూ తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనను నమ్మించి మోసం చేసిన కళ్యాణ్కు కఠిన శిక్ష పడాలని ఆమె కోరుతోంది.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాలని బాలిక తల్లిదండ్రులు తెలిపారు.మరి ఈ కేసును పోలీసులు నీరుగారుస్తారా లేక బాలికకు న్యాయం చేస్తారా అనేది వేచి చూడాలి.