`విజయదశమికి మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది.ఇక చిన్నబాబుకు ఏదో ఒక శాఖ గ్యారెంటీ.
అంచనాలకు అనుగుణంగా పనిచేయని మంత్రులపై వేటు తప్పదు` అనే వార్తలు గుప్పుమన్నాయి.కానీ దశమి వెళ్లిపోయింది.
కానీ మంత్రి వర్గ విస్తరణపై సీఎం చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు.కొత్త సంవత్సరం వచ్చింది.
ఇక కేబినెట్ విస్తరణపై మంత్రులు కూడా ఆశలు వదిలేసుకున్నట్టే కనిపిస్తోంది.పదవులు ఆశించి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిస్తే.
పార్టీలో సీనియర్లు అలకబూనవచ్చన్న అభిప్రాయంతోనో మరేదన్నా కారణంతోనో ఈ తేనెతుట్టెను మాత్రం కదిలించేందుకు నిరాసక్తత చూపుతున్నారు.
కేబినెట్ విస్తరణపై మంత్రులు కూడా ఆశలు వదిలేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కేంద్రం నుంచి వస్తున్న నిధులు కూడా అంతంతమాత్రమే కావడంతో తాము మాత్రం చేసేదేముందని కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు.కేంద్రమంత్రి వెంకయ్య మాటలు వినడం వల్లనే ఇదంతా జరుగుతుందని కొందరు అంటుంటే ఆయన తన స్థానం కోసం రాష్ట్ర ప్రయోజనాలు ఫణంగా పెడుతున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో తాను మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం దండగని ఒక సీనియర్ నేత మీడియా ముందు వాపోయినట్టు వార్తలు వస్తున్నాయి.`ఉన్నవారు ఉద్ధరిస్తున్నదేమిటి? నారాయణ తప్ప మిగిలిన వారంతా ఉత్సవ విగ్రహాలై పోయార`ని కీలక పదవిలో ఉన్న మరో నాయకుడు అంటున్నారన్న గుసగుసలు వెలగపూడిలో వినిపిస్తున్నాయి.
తమ పాత్రను పెద్దాయన గుర్తించడం లేదని సీఎంని సంతోషపెట్టడం కోసం జగన్పై విపరీతంగా దాడి చేసిన మంత్రులు కూడా వాపోయారు.ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బాహాటంగానే అసంతృప్తి వెలిబుచ్చారు.
మరో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆ పదవికి తగిన నిర్ణయాత్మక పాత్ర నిర్వహించలేకపోతున్నారని ఆయన అనుయాయులే అంటున్నారు.`ఇవన్నీగాక లోకేశ్కు చెప్పకుండా చేసేదేమీ ఉండటం లేదు.ఆయన తండ్రి కన్నా టఫ్గా ఉంటారు.ఇంకేం చేస్తాం` అని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
మరి ఇలాగైతే కష్టమేనని అంటున్నారు.