వైసీపీలో మంత్రి వర్సెస్ స్పీకర్ మధ్య ఆట మొదలైంది.శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వర్సెస్ స్పీకర్ మధ్య ఇప్పుడు ఆధిపత్య రాజకీయాలకు తెరలేచింది.
జిల్లా నుంచి ముందు మంత్రిగా కృష్ణదాస్ ఒక్కరే ఉండేవారు.ఆ తర్వాత సీదిరి అప్పలరాజు కూడా మంత్రి అయ్యారు.
మరో పది నెలల్లో జరిగే మార్పులు, చేర్పుల్లో కృష్ణదాస్ ప్లేస్లో తాను మంత్రి అవ్వాలని స్పీకర్ తమ్మినేని పట్టుదలతో ఉన్నారు.
తన పదవిపై గురి పెట్టిన తమ్మినేనిపై కృష్ణదాస్ గుస్సాతో ఉన్నారు.తన చాపకిందకు నీరు రాకుండా ఆయన తన జాగ్రత్తలు తాను తీసుకుంటున్నారు.మరో వైపు కృష్ణదాస్ను ఎలా తప్పిస్తారా ? తాను ఎప్పుడు మంత్రిని అవుతానా ? అని తమ్మినేని కాచుకుని ఉన్నారు.ఈ వార్ ఇలా ఉండగానే ఇద్దరి మధ్య మరో గేమ్ స్టార్ట్ అయ్యింది.విద్యార్థి దశలో ఉన్నప్పుడు వీరిద్దరు మంచి ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు.తాజాగా శ్రీకాకుళం జిల్లాకు మంజూరు అయిన క్రికెట్ స్టేడియాన్ని ఆముదాలవలసకు దగ్గర్లో ఉన్న ప్రాంతానికి తరలించుకుపోయారు.
ఇది స్పీకర్ నియోజకవర్గంలో ఉంది.ఇది మంత్రి ధర్మాన కృష్ణదాస్కు నచ్చడం లేదట.తానున్న మంత్రివర్గంలో తనకు తెలియకుండానే ఫైల్ కదిలించి.
పని కానిచ్చేశారని ఆయన అసంతృప్తితో ఉన్నారు.అంతే కాకుండా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోనే స్టేడియం ఉండాలి గాని.
ఆముదాలవలసలో ఎలా పెడతారని ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట.ఎలాగైనా స్టేడియాన్ని శ్రీకాకుళంకు షిఫ్ట్ చేయాలని పట్టుదలతో ఉన్నారట.
చివరకు ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు పంచాయితీ వద్దకు వెళ్లనుందని తెలుస్తోంది.మరి జగన్ ఈ ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతారో ? చూడాలి.ఇద్దరు ఆయనకు అత్యంత ఇష్టులే కావడంతో ఈ గేమ్లో ఎవరు గెలుస్తారా ? అన్న చర్చలు సిక్కోలులో వినిపిస్తున్నాయి.