నిన్న రిపబ్లిక్సి నిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్.
వైసీపీ పార్టీని టార్గెట్ చేసుకుని భారీ స్థాయిలో డైలాగులు వేశారు.వైసీపీ మంత్రులు సన్నాసులు అంటూ.
తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది.సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం అనవసరంగా తలదూరుస్తుందని.
చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలి పోతారు అంటూ పవన్ సీరియస్ గా వైసీపీ పై వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ని వైసీపీలో అసలు ఎవరూ పట్టించుకోరని.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారే.
ఆన్లైన్ టికెట్ బుకింగ్ తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు.
సినిమా రంగంలో ఒక పనికిమాలిన స్టార్ పవన్ కళ్యాణ్ అని మండిపడ్డారు.
అతని గురించి ఎవరూ ఆలోచించరు అని రెండు చోట్ల పోటీ చేసి దారుణంగా ఓటమి చెందాడని పేర్కొన్నారు.ఇండస్ట్రీ పెద్దలే టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టడం జరిగిందని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీ మధ్య చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ పై అసలు కక్ష ఎందుకు ఉంటుందని, సినిమా ప్రోగ్రాంలో రాజకీయాల గురించి మాట్లాడుకునే పావలా కళ్యాణ్ అంటూ సుతిమెత్తగా వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీరియస్ కామెంట్లు చేశారు.పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయే వ్యక్తి.
ఎవరు డబ్బులు ఇస్తే వారికి ప్రచారం చేస్తాడు అంటూ మండిపడ్డారు.ఈ క్రమంలో మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్.
కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు వెల్లంపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.