బిజేపి జాతీయ కార్యవర్గ సమావేశానికి మోడీ హైదరాబాద్ రావడం తెలిసిందే.అయితే ఈ పర్యటనకు మోడీకి స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ రాకపోవడం సంచలనంగా మారింది.
అయితే ఈ వ్యవహారంపై టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.ప్రధానికి స్వాగతం పలకడానికి కచ్చితంగా ముఖ్యమంత్రి రావాలన్న ప్రోటోకాల్ ప్రత్యేకంగా ఏమీ లేదని మంత్రి తలసాని తెలిపారు.
ఈ క్రమంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న క్యాబినెట్ మంత్రి ఎవరైనా రిసీవ్ చేసుకోవచ్చని తెలిపారు.అయితే మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుందని తెలిపారు.హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రధాని మోడీ భారత్ బయోటెక్ పర్యటన చేపట్టారు అప్పుడు ప్రోటోకాల్ అవసరం లేదా అని ప్రశ్నించారు.గతంలో మోడీ వచ్చినప్పుడు చాలాసార్లు సీఎం కేసీఆర్ రిసీవ్ చేసుకున్నారని తెలిపారు.
అయితే తాజా పరిణామాలపై తప్పు పట్టడానికి ఏమీ లేదని పేర్కొన్నారు.యశ్వంత్ సిన్హా కు తాము మద్దతు ఇవ్వడం వల్ల.
కెసిఆర్ ఆయనకు స్వాగతం పలికారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు
.