టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తన 47వ ఏట అడుగుపెట్టారు.మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ సెలబ్రిటీలు, అభిమానులు,రాజకీయాన్ని నాయకులు.
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ బాబు చేసిన మంచి పనుల గురించి, అతని గొప్పతనం గురించి కొనియాడుతున్నారు.ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అయితే మహేష్ అభిమానులు కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు.
కాగా ఇది ఇలా ఉంటే తాజాగా ఏపీ మంత్రి రోజా కూడా మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది.
ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మ ఇస్తున్న మనసున్న మహారాజు మహేశ్ బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు.
అంటూ రోజా పోస్ట్ చేసింది.ఈ పోస్ట్తో పాటుగా గతంలో మహేష్ బాబును ఇంటర్య్వూ చేసిన వీడియోను కూడా పోస్ట్ చేసింది రోజా.
అందుకు సంబంధించిన వీడియో ని షేర్ చేస్తూ రాజన్న పై సూపర్ స్టార్ మహేష్ బాబు మనసులో మాట అని క్యాప్షన్ కూడా జోడించింది.ఇక ఆ వీడియోలో వైఎస్సార్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.
ఆ విషయం పై స్పందించిన మహేష్.రాజకీయాల గురించి పక్కన పెడితే రాజశేఖర్ రెడ్డి గారిని నేను కలిశాను.
అప్పుడు జగన్ గారు కూడా ఉన్నారు.ఆయనతో నాన్న చాలా క్లోజ్ గా ఉన్నారు నిజాయితీగా చెప్పాలి అంటే వాళ్ళు అమేజింగ్ పీపుల్ అని మహేష్ బాబు సమాధానం ఇచ్చాడు.ఈ వీడియోని మంత్రి రోజా సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇకపోతే మహేష్ బాబుతో కలిసి నటించాలి అని ఉంది అంటూ గతంలో రోజా జబర్దస్త్ షోలో తెలిపిన విషయం తెలిసిందే.ఇకపోతే రోజా ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయాలలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల టీవీ షోలకు సినిమాలకు విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించింది.కాగా మహేష్ బాబు తో నటించకపోయినప్పటికీ మహేష్ బాబు,తండ్రి కృష్ణతో రోజా పలు సినిమాల్లో నటించింది.