అధికారిక లాంఛనాలతో మంత్రి పాశ్వాన్ అంత్యక్రియలు !

కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ ప్రారంభకర్త రాంవిలాస్ పాశ్వాన్ గురువారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.ఈ మధ్యే గుండె సంబంధిత సర్జరీ చేయించుకున్న రాంవిలాస్ పాశ్వాన్ .

 Union Minister Ram Vilas Paswan Funeral, Bjp , Modi , Ramnadh Kovindh, Rahul Ga-TeluguStop.com

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ ట్విటర్ వేదిక గా ప్రకటించి , అధికారికంగా ధ్రువీకరించారు.

ఇకపొతే , రాంవిలాస్ పాశ్వాన్ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ 12 జన్‌పథ్‌ లోని ఆయన నివాసానికి తరలించనున్నారు.ఆ తర్వాత ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం మధ్యాహ్నం పాట్నకు తరలించి , పట్నాలోని లోక్‌ జనశక్తి పార్టీ ఆఫీసులో మద్దుతుదారులు, అభిమానులు నివాళులర్పించేందుకు వీలుగా ఉంచుతారు.

ఇక, శనివారం పట్నాలో అధికారిక లాంఛనాలతో పాశ్వాన్ అంత్యక్రియలను నిర్వహిస్తారు.మంత్రి పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇది తనకు మాటలకందని విషాదమని ఆయన లోటు తీర్చలేనిదని మోడీ చెప్పారు.ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా కూడా లోటు అని వ్యాఖ్యానించారు.

రామ్ విలాస్ పాశ్వాన్ జీ ఆకాల మరణం విచారకరం.ఈ రోజు పేద, అణగారిన వర్గాలు తమ తరఫున పోరాడే బలమైన నాయకుడిని కోల్పోయారు.

ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ రాహుల్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube