తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఐటీ ఎదుట హాజరైయ్యారు.భద్రారెడ్డి రెండోసారి ఐటీ అధికారుల విచారణకు హాజరైయ్యారని సమాచారం.
ఇందులో భాగంగా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.అదేవిధంగా మెడికల్ కాలేజీలో డొనేషన్ల వ్యవహారాలపై ఆయనను ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు ఐటీ అడిగిన ఫార్మాట్ లో మల్లారెడ్డి కాలేజీ వివరాలను భద్రారెడ్డి అధికారులకు అందించారని తెలుస్తోంది.అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్లతో పాటు సీట్ల పేమెంట్లకు సంబంధించిన వివరాలను సైతం భద్రారెడ్డి అధికారులకు అందజేశారు.
ప్రభుత్వ ఫీజుల కంటే అధిక మొత్తంలో డొనేషన్లు తీసుకున్నారని ఆరోపణల నేపథ్యంలో ఇటీవల మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.