మంత్రి మల్లారెడ్డి ఏది మాట్లాడినా దాంట్లో ఏదో ఒక చమత్కారం కచ్చితంగా ఉంటుంది.అయితే చివరకు అది ఆయన్ను అభాసుపాలు చేస్తుంది.
ఇక ఇప్పుడు తెలంగాణలో నిండు కుండల్లా కురుస్తున్న వర్షంపై కూడా ఆయన చేసిన కామెంట్లు మళ్లీ ట్రోలింగ్కు దారి తీశాయి.ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పట్టణాలు, కాలనీలు అన్నీ వరద నీరుతో నీట మునుగుతున్నాయి.
దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.ఇలాంటి టైమ్లో ఆచితూచి మాట్లాడాలి.
లేదంటే పబ్లిక్ ఫైర్ కావడం కామన్ అయిపోతుంది.
కానీ మంత్రి మల్లారెడ్డి మాత్రం ఇలాంటి సున్నితమైన అంశాలమీద నోరు జారారు.
నిన్న పార్టీ మీటింగ్ లో కేటీఆర్ ఎదరుగానే ఆయన మాట్లాడుతూ ఇప్పుడు తెలంగాణలో పడుతున్న వర్సాలు మొత్తం కేసీఆర్ వల్లే కురుస్తున్నాయని, ఆయన వల్లే ఇంతగా వర్షాలు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు వర్షాలు ఎక్కువగా అయ్యాయని, కాబట్టి వర్షాలు ఆపాలంటూ వరుణ దేవుడిని కోరుతున్నానంటూ నిత్యం మొక్కుతున్నానని చెప్పారు.
ఇక్కడే ఆయన మరోసారి ట్రోలింగ్కు గురవుతున్నారు.దీనిపై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు వస్తున్నాయి.
నెటిజన్లు కామెంట్లలో ఇలా రాసుకొస్తున్నారు.కేసీఆర్ వల్లే వర్షాలు పడుతుంటే కేసీఆరే వర్షాలను ఆపాలి కదా దానికి వరుణ దేవుడికి ఎందుకు మొక్కడం కేసీఆర్కు మొక్కితే ఆయనే ఆపేస్తారు కదా అంటూ ట్రోల్ చేస్తున్నారు.ఇంకొందరు అయితే కేసీఆర్ వర్షాలు తెప్పించి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఇలాంటి సీఎం మనకు వద్దంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
వెంటనే వర్షాలను కేసీఆర్ ఆపే విధంగా మంత్రి మల్లారెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం కొసమెరుపు.ఏదేమైనా కూడా మంత్రి మల్లారెడ్డి ఏదో అనుకుని కేటీఆర్ ముందు కేసీఆర్ను ఆకాశానికి ఎత్తేయాలని మాట్లాడితే చివరకు అది ఆయన ఇమేజ్ను డ్యామేజ్చేసే దాకా వెళ్తోందని చెప్పాలి.
.