ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు మంత్రి మల్లారెడ్డి.మోడీ అంటేనే మోసలు.
నెంబర్ వన్ కేడీ అంటూ విరుచుకపడ్డారు.కుటుంబపాలన కతం కరో అంటున్న మోడీ తెలంగాణకు ఏం చేశావో చెప్పు అంటూ నిలదీశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేస్తే నా మంత్రి పదవికి, MLA పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు.హనుమకొండ జిల్లా లో పర్యటించిన మల్లారెడ్డి.
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో జరుగుతున్న కార్మిక మాసోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి పాల్గొన్నారు.బీజేపీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తుందని .బీజేపీ కౌరవుల నుండి దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీ అమ్మవారిని మెక్కినట్లు తెలిపారు.అటు పీసీసీ చీఫ్ రేవంత్ పైన విమర్శలు గుపించారు మల్లారెడ్డి.
రేవంత్ రెడ్డి కొత్త బిచ్చగాడని .కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్ఛేది లేదు.రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముందు అమలు చేయాలని సవాల్ విసిరారు.కేంద్రప్రభుత్వం కార్మికుల అంటేనే ఇబ్బంది పెడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే చాలా ఉద్యోగాలు వచ్చేవి…కాంగ్రెస్,బీజేపీ తొక్కిపడేశాయని మండిపడ్డారు.కాంగ్రెస్,బీజేపీ పార్టీలు కార్మికులను నాశనం చేశాయన్నారు.
బీజేపీ ప్రైవేటు వ్యవస్థను తీసుకువస్తుంది.అన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేసారు.
సీఎం కెసిఆర్ కార్మిక పక్షపాతి అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.ఈనెల 31న కార్మిక మాసోత్సవ ముగింపు సభ కాజీపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు.