తెలంగాణలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది.మంత్రి మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు, ఘట్ కేసర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీల ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేపీ గూటికి చేరనున్నారు.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వయంగా ప్రకటించారు.సుదర్శన్ రెడ్డితో పాటు ఘట్ కేసర్ మండలానికి చెందిన ఇతర నేతలు, కార్యకర్తలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిపారు.
అదేవిధంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ లు బీజేపీ కండువా కప్పుకునేందుకు సుముఖంగా ఉన్నారని వెల్లడించారు.