గత కొద్ది మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న కేటీఆర్ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.చెడుపై మంచి సాధించిన ప్రతీకగా, చీకట్లను పారదోలి వెలుగును నింపే పండుగగా జరుపుకుంటున్న దీపావళి పండుగ అందరి జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
దీపావళిని సురక్షితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా మంత్రి కేటీఆర్ విషెస్ తెలియజేయడం జరిగింది.
గత కొద్ది రోజులుగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొంటున్నారు.ఈ క్రమంలో ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ మరోపక్క ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరిస్తున్నారు.
సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఉప ఎన్నికను తెలంగాణలో ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నయి.