టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని కేటీఆర్ సీరియస్ అయ్యారు.
ఈ క్రమంలో ఓపిక నశిస్తే పోరాటం తప్పదని కేంద్రాన్ని హెచ్చరించారు.లక్షలాది చేనేతల విషయంలో మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో.వరంగల్ లోని మెగా టెక్స్టైల్ పార్క్ కావచ్చు.పోచంపల్లి లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్.టెక్స్టైల్, గద్వాల, కొత్తకోట, నారాయణ పేట, సిద్దిపేట, దుబ్బాక, జమ్మికుంట, కమలాపూర్, సిరిసిల్ల ప్రాంతాలలోని చేనేత సమూహాల కోసం కేంద్ర ప్రభుత్వం మనసు పెట్టి.ఈ బడ్జెట్ లో పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈసారి ఓపిక నశిస్తే కేంద్ర ప్రభుత్వం పై పోరాటానికి.కూడా వెనకాడరు అంటూ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చేనేత కార్మికుల విషయంలో మోడీ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు.చేనేతల విషయంలో ఏడున్నర సంవత్సరాల నుండి లేఖలు రాస్తున్నా….
కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.మెగా పవర్ లోన్ క్లస్టర్ నీ మంజూరు చేయించాలని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని డిమాండ్ చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండటంతో బండి సంజయ్ ని కోరుతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.