కృష్ణాజిల్లా మచిలీపట్నం: మచిలీపట్నంలో YSR, PKM క్రికెట్ పోటీలను ప్రారంభించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని చంద్రబాబు నాయుడు పై మండిపడ్డారు.
అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గౌరవించకపోవడం పట్ల ప్రతిపక్షాల విమర్శలకు స్పందించిన ఆయన.
చంద్రబాబు నాయుడికి శవ రాజకీయాలు శవాల మీద పేలాలు ఏరుకుంటారు, చిల్లర ఏరుకుంటూ పుట్టుకతో వచ్చినవి అని విమర్శించారు.జగన్మోహన్ రెడ్డి రేపు, లేదా ఎల్లుండి ఎన్నికలు వెళ్ళవచ్చు అని చంద్రబాబు నాయుడు మాట్లాడటంపై కొడాలి నాని మండిపడ్డారు.మాకు ప్రజలు 151 స్థానాల్లో గెలిపించి అధికారమిస్తే ఎందుకు ఎన్నికలకి వెళ్లాలని మండిపడ్డారు.
విజయవాడ కి ఎన్టీఆర్ పేరుని పెట్టడమే సమంజసమని, ఎన్టీఆర్ ని అభిమానించే ఎక్కువ మంది విజయవాడకే పెట్టాలని కోరుకుంటున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పేర్ని కిట్టు, నగర పాలక సంస్థ మేయర్ వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ కవిత, కార్పొరేటర్లు, వైయస్సార్ సిపి నాయకులు క్రీడాభిమానులు పాల్గొన్నారు.