ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు.కోటంరెడ్డికి సంబంధించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదన్నారు.
ఆయన ఎందుకు అలా మాట్లాడారో అర్ధం కావడం లేదని చెప్పారు.ఇదంతా టీకప్పులో తుఫాన్ వంటిదని తెలిపారు.
సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ లు జరగవని పేర్కొన్నారు.ఈ విషయంపై అధిష్టానం తనతో ఇంకా మాట్లాడలేదని వెల్లడించారు.
కోటంరెడ్డి ఎక్కడా పార్టీ వీడుతున్నట్లు చెప్పలేదని తెలిపారు.