ఎంపీ సోయం బాపురావుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బీజేపీ తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు.
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు నుంచి బీజేపీకి భయం పట్టుకుందని విమర్శించారు.బీజేపీ కులం, మతం మీదనే ప్రచారం చేస్తోంది తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ ముందుకు వెళ్తోందని వెల్లడించారు.