తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత చురుగ్గా ఉంటారో ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కావొచ్చు.కుమార్తె కమ్ ఎంపీ కవిత.
మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ లు దూకుడుగా ఉంటారు.చూసి రమ్మంటే.
తేల్చి వచ్చే తీరులో వ్యవహరించే తత్వం వారి సొంతం.తాజాగా మంత్రి హరీశ్ రావు అలాంటి కార్యక్రమానికే తెర తీశారు.
కేసీఆర్ నోట తరచూ ఒక మాట వినిపిస్తూ ఉంటుంది.
తాను చెప్పిన రీతిలో ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు అవసరమైతే ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయి మరీ పూర్తి చేస్తానని.
ఆ విషయంలో మరో మాట లేదని చెబుతుంటారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నారేమో కానీ.
మంత్రి కమ్ మేనల్లుడు హరీశ్ మేనమామ మాటల్ని ఆచరణలో పెట్టేశారు.తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల పూర్తే ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం అధికారులు పల్లె నిద్ర అన్న కార్యక్రమాన్ని చేపడితే.ప్రభుత్వం మొదలెట్టిన ప్రాజెక్టుల పూర్తి కోసం హరీశ్ తాజాగా ‘ప్రాజెక్టుల నిద్ర’ కార్యక్రమాన్ని షురూ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన హరీశ్.
జిల్లాలో సాగుతున్న ప్రాజెక్టులపై సమీక్షను నిర్వహించారు.
ఉదయం నుంచి మొదలైన సమీక్షా కార్యక్రమం సాయంత్రం వరకూ సాగింది.అనంతరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన ఆయన.రాత్రి వేళ కావటం.ప్రాజెక్టుల పని విషయంలో తన కమిట్ మెంట్ ప్రదర్శించే ప్రయత్నంలో సరికొత్తగా ‘ప్రాజెక్టు’ నిద్రను షురూ చేశారు.
హరీశ్ తీరును చూసినోళ్లు.మేనమామ మాట చెబితే.
మేనల్లుడు చేతల్లో చేసి చూపిస్తున్నాడే అని అనుకోవటం కనిపించింది.