రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్లోని మల్టీ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష.జాతీయ సగటును మించి రాష్ట్రంలో వ్యాక్సినేషన్.
వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలని మంత్రి హరీష్ రావు ఆదేశం.శనివారం జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం.
బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి, 38.5 శాతం మందికి రెండో డోస్ పూర్తి.కరోనా తగ్గుముఖం పట్టడంతో 350 పడకలు గల కింగ్ కోఠి జిల్లా దవాఖానలో సాధారణ వైద్యసేవలు పునరుద్ధరణ.
టిమ్స్ హాస్పిటల్లో 200 పడకలు కోవిడ్ చికిత్స కోసం మిగతా బెడ్స్ తో సాధారణ వైద్య సేవలు ప్రారంభం.టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు, ఆసుపత్రి బకాయిలు చెల్లింపు.