ఏపీకి రాజధానిగా అమరావతి ఉండాల్సిందే అంటూ స్థానికులు డిమాండ్ చేస్తుండగా మరో వైపు ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు.నేడు అసెంబ్లీలో ఈ విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
వైజాగ్తో పాటు మరో రెండు ప్రాంతాలను రాజధానులుగా ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటీ అంటూ జనాలు ప్రశ్నిస్తుండగా మంత్రి బుగ్గన ఆ విషయమై స్పందించాడు.
అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరుగకుండా చూస్తాం.ప్రతి ఒక్కరికి వారి భూములు వారికి ఇచ్చే విధంగా చర్చలు జరుపుతున్నాం.ప్రతి ఒక్కరి భూమిని ఇచ్చేస్తాం.వారి భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఎలా స్పందిస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.