అమరావతి: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాం.చాలా కాలంగా పెండింగులో ఉన్న సమస్యలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించాం.
కరోనా కారణంగా పరిపాలన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కర్నీ ఫ్యామ్లీ మెంబరుగా భావిస్తుంది.
త్వరలోనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం.
టైమ్ బౌండ్ పెట్టుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.
ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకుని పరిష్కరిస్తాం.ఉద్యోగులు లేవనెత్తిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు సానుకూలంగా ఉంది.
ఉద్యోగుల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ బుధవారం సమావేశం అవుతారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కంటిన్యూగా టచ్లో ఉంటాం.
ఉద్యమంలో ఉన్న తొమ్మిది సంఘాలను ఆందోళన విరమించాలని కోరాం.