ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పిన మంత్రి బొత్స..

ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త చెప్పారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ… త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం అన్నారు.సీఎం వై ఎస్ జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్న ఆయన.

 Minister Botsa Satyanarayana Key Announcement On Dsc Notification, Minister Bots-TeluguStop.com

ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించాం.త్వరలో బదిలీలపై కూడా నిర్ణయం తీసుకుంటాం అన్నారు.

బదిలీలకు పరదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం.ఇందుకోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నాం అన్నారు.

ఇక, విశాఖపట్నం పరిపాలన రాజధాని మా పాలసి.మేం డైవెర్షన్ చెయ్యాల్సిన అవసరం లేదన్నారు బొత్స.చంద్రబాబు అమరావతిలో రాజధానిని కాపురం కోసం పెట్టాడా?అని ప్రశ్నించిన ఆయన.అమరావతి రాజధాని అయితే చంద్రబాబు కాపురం హైదరాబాద్ లో ఎందుకు పెట్టారు?కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటి?అని నిలదీశారు.విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారు.ఈ రోజు బిడ్డింగ్ తో ఆ విషయం స్పష్టమైందన్నారు.మేం చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం.

కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అన్నారు.

మరోవైపు.చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశంలేదని జోస్యం చెప్పిన బొత్స.

చంద్రబాబు మంచి నటుడు, మ్యానిపులేటర్ అంటూ మండిపడ్డారు.కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై పరిశీలిస్తున్నాం.

సీఎం వై ఎస్ జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.విద్యార్థులకు రాగి జావా నిలిపివేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

పరీక్షలు, ఒంటి పూట బడుల వలన చిక్కిలు ఇస్తున్నామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube