నియమాల మాల అయ్యప్ప మాలను వేసుకున్న ఎవరైనా కూడా మాలలో ఉన్నన్ని రోజులు కూడా చెప్పులు ధరించరు.చెప్పులు కనీసం ముట్టుకోవడం కూడా దీక్షకు భంగం అంటూ హిందువులు భావిస్తారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాలను చాలా నిష్టగా వేస్తూ ఉంటారు.కాని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అయ్యప్ప మాల వేసుకుని చెప్పులు వేసుకుని హిందుత్వంను అగౌరవ పర్చుతున్నట్లుగా కొందరు టీడీపీ నాయకులు ఎద్దేవ చేశారు.
టీడీపీ నాయకుల విమర్శలపై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.ప్రపంచంలోని అందరికంటే ఎక్కువగా నేను హిందుత్వ వాదిని అని, నేను చాలా కాలం నుండి అయ్యప్ప మాల వేస్తున్నాను.
నా యొక్క అనారోగ్య కారణాల వల్ల చెప్పులు వేస్తున్నాను.నేను టీడీపీలో ఉన్న సమయంలో కూడా చెప్పులు వేసుకున్నాను.ఆ సమయంలో నా తప్పు కనిపించని వారికి ఇప్పుడు వారికి నా తప్పు కనిపిస్తుందా అంటూ ఈ సందర్బంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.