దొడ్డి దారిలో పార్టీలో చేరేందుకు గంటా ప్రయత్నం -మంత్రి అవంతి

వైసీపీలోకి చేరేందుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.గంటాపై మంత్రి అవంతి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Ap, Ycp Leader, Minister Avanthi Srinivas, Tdp Leader, Ganta Srinivas, Cm Jagan,-TeluguStop.com

గంటా చేసిన అరాచకాలు, కేసుల నుంచి తప్పించుకునేందుకు దొడ్డి దారిలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు.వైసీపీలో చేరేందుకు ముహూర్తాలు, లీకులు అంటూ ప్రచారం కోరుకుంటున్నారని విమర్శించారు.

గంటా చేసిన భూ కుంభకోణంపై గతంలో మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు ఫిర్యాదు చేశారని అవంతి శ్రీనివాస్ తెలిపారు.దీనిపై ఇప్పటికే సిట్ వేసి దర్యాప్తు కూడా చేయించారని చెప్పుకొచ్చారు.

భూ కుంభ కోణం, సైకిళ్ల స్కామ్ లపై తాను, విజయసాయిరెడ్డి మాట్లాడమని అన్నారు.వైసీపీలో గంటా చేరేది, లేనిది అధిష్టానం చూసుకుంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

గంటా శ్రీనివాసరావు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారని.అధికారం లేకపోతే ఆయన ఉండలేరని అవంతి విమర్శించారు.కాగా, మరోవైపు జగన్ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు సవాల్ విసరడంలో అర్ధం లేదని అవంతి శ్రీనివాస్ అన్నారు.చంద్రబాబు చెబితే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయబోరని విమర్శించారు.

ప్రజలు తమకు అధికారం ఇచ్చింది ఐదేళ్లకు కానీ, ఏడాదిన్నరకు కాదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube