సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు.ఇప్పటికే దేశంలోని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
తాజాగా ప్రముఖ హీరోయిన్ తమన్నాకు కరోనా నిర్ధారణ అయింది.గత కొన్ని రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న తమన్నా కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.
ప్రస్తుతం తమన్నా హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మిల్కీ బ్యూటీకి కరోనా నిర్ధారణ అయిందని తెలియడంతో ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమన్నా త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.
ఆగష్టు నెల చివరి వారంలో తమన్నా తల్లిదండ్రులకు కరోనా నిర్ధారణ అయింది.కొన్ని రోజుల చికిత్స అనంతరం వాళ్లిద్దరూ కోలుకున్నారు.ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న తమన్నా గత రెండు రోజుల నుంచి కరోనా లక్షణాలు కనిపిస్తూ ఉండటంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నారు.
అయితే తమన్నాలో ఏ స్థాయిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయనే వివరాలు తెలియాల్సి ఉంది.
సిటీమార్, అంధధూన్, శీతాకాలం సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ కు కూడా తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.తమన్నాకు కరోనా నిర్ధారణ కావడంతో ఆమె నటించే సినిమాల షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ పడే అవకాశం ఉంది.
తమన్నాకు వైరస్ నిర్ధారణ కావడంతో ఆమె సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.
అయితే కరోనా వైరస్ సోకినట్లు తమన్నా నుంచి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.
గతంలో తల్లిదండ్రులకు కరోనా నిర్ధారణ కాగా స్వయంగా వెల్లడించిన తమన్నా తనకు సోకినట్లు ప్రకటన చేయాల్సి ఉంది. హ్యాపీడేస్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి వరుస విజయాలు సొంతం చేసుకుంటున్న తమన్నా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ ఉండటం గమనార్హం.