టాలీవుడ్ లో దాదాపుగా స్టార్ హీరో ఫేమ్ కలిగినటువంటి అందరి హీరోల సరసన నటించినటువంటి హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు.అయితే ఈ అమ్మడు తన అంద చందంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు నటించినటువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.దీంతో ఈ అమ్మడు తాను నటించే సినిమాల కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తోంది.
అందుకే ఈ మధ్య తమన్నా సినిమాల విషయంలో జోరుని తగ్గించింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు వెబ్ సీరీస్ లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సినీ పరిశ్రమలో తనతో కొంత మేర సన్నిహితంగా ఉంటున్నటువంటి ఓ దర్శకుడు తమన్నా పాత్రకి సరిగ్గా సరిపోయే ఓ కథని రెడీ చేసుకొని వినిపించాడట.అయితే తమన్నాకి కూడా ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
అన్ని కుదిరితే ఈ ఏడాదిలో తమన్నా వెబ్ సిరీస్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే తొందర్లోనే తమన్నా తన వెబ్ సిరీస్ కి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని మరియు కాజల్ అగర్వాల్ తదితరులు కూడా ఈ వెబ్ సిరీస్ లపై దృష్టి సారిస్తున్నారు.దీంతో తమన్నా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమన్నా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సిటీ మార్ అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది.అయితే ఈ చిత్రంలో స్టార్ కబడ్డీ కోచ్ జ్వాల రెడ్డి పాత్రలో తమన్నా నటిస్తోంది.అలాగే ఈ చిత్రంలో తమన్నా తో పాటు టాలీవుడ్ యాక్షన్ కింగ్ గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి.