ప్రస్తుత కాలంలో బయోపిక్ సినిమాల హవా కొనసాగుతుంది.ప్రతి ఒక్కరంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సెలబ్రిటీల బయోపిక్ చిత్రాలు రావడం సర్వసాధారణం అయ్యాయి.
ఇప్పటికే ఎంతోమంది సినీ రాజకీయ క్రీడా రంగానికి చెందిన వారి బయోపిక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే సీనియర్ నటీమణులైనటువంటి సావిత్రి బయోపిక్ చిత్రం మహానటి పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో నటి కీర్తి సురేష్ ఎంతో అద్భుతమైన నటనను కనపరిచారు.ఈ నటనకు గాను ఈమెకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకున్నారు.
ఇక సావిత్రి తర్వాత ఇండస్ట్రీలో అదే స్థాయిలో నటనను కనబరిచిన వారిలో జమున ఒకరు.ముఖ్యంగా ఈమె వెండితెరపై సత్యభామ పాత్రలలో ఎంతో ఒదిగిపోయి నటించేవారు.ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలలో పలు భాషలలో వరుస సినిమాలలో నటించిన జమున జనవరి 27వ తేదీ తుది శ్వాస విడిచారు.అయితే జమున మరణించడంతో ఆమె సినీ ప్రస్థానం నేటితరం వారికి తెలియడం కోసం జమున బయోపిక్ చిత్రాన్ని చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దివంగత నటి జమున బయోపిక్ చిత్రాన్ని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ హిందీ భాషలలో కూడా విడుదలయ్యే విధంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే ఈమె బయోపిక్ చిత్రానికి సంబంధించిన కథను నటి తమన్నాకు వివరించగా ఈ సినిమా కథ నచ్చిన తమన్నా జమున బయోపిక్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.మరి జమున బయోపిక్ చిత్రం గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.