విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్ కు సంబంధించిన తాజా అప్ డేట్ అంచనాలు ఆకాశానికి పెంచేసింది.ఈ సినిమా లో రియల్ హీరో మైక్ టైసన్ నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు పెరిగి పోయాయి.
మైక్ టైసన్ మొదటి సారి ఇండియన్ సినిమాలో కనిపించబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా గురించి చర్చిస్తున్నారు.మైక్ టైసన్ వంటి అంతర్జాతీయ స్థాయి స్టార్ ను ఈ సినిమాలో నటింపజేసేందుకు సిద్దం అయ్యారు అంటే ఏ స్థాయిలో పారితోషికం ఇచ్చి ఉంటారో ఊహించడం కూడా కష్టంగా ఉంది.
విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ బడ్జెట్ దాదాపుగా వంద కోట్లు అంటూ మొదటి నుండి ప్రచారం చేస్తున్నారు.ఆ వంద కోట్లలో మైక్ టైసన్ కు గాను దాదాపుగా పాతిక కోట్లు ఇవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.
దాదాపుగా విజయ్ దేవరకొండకు సమానమైన పారితోషికంను మైక్ టైసన్ కు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ విషయమై జరుగుతున్న ప్రచారం సినిమా స్థాయిని పెంచేసింది.మైక్ టైసన్ సినిమాలో ఉండటం వల్ల అసలు కథ ఏమై ఉంటుందా అంటూ అంతా కూడా చాలా ఆసక్తిగా కనిపిస్తున్నారు.గత ఏడాది నుండి ఊరిస్తున్న లైగర్ సినిమా విడుదల తేదీ ఇంకా కూడా సస్పెన్స్ గానే ఉంది.
భారీ స్థాయిలో ఈ సినిమాను పూరి స్వీయ దర్శకత్వంలో కరణ్ జోహార్ మరియు ఛార్మిలతో కలిసి నిర్మిస్తున్నాడు.విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా సినిమా అవ్వడంతో పాటు రౌడీ స్టార్ ను చాలా ప్రత్యేకంగా చూపించబోతున్న సినిమా కనుక ఖచ్చితంగా లైగర్ సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్షేషన్ గా ఉంటుందని రౌడీ ఫ్యాన్స్ అంటున్నారు.
అది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.